malli pelli: ‘మళ్లీ పెళ్లి’ విడుదల ఆపండి.. కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి

  • నరేశ్, పవిత్ర జంటగా రూపొందిన 'మళ్లీ పెళ్లి'  
  • తన ప్రతిష్టను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ రమ్య రఘుపతి అభ్యంతరం 
  • కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్
actor naresh third wife ramya raghupathi approaches the court to stop the release of malli pelli movie

రేపు విడుదల కానున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు.

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. నరేశ్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More Telugu News