Rajinikanth: రజనీకాంత్ కు ఘన స్వాగతం పలికిన బాలకృష్ణ

  • ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన రజనీ
  • గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన బాలయ్య
  • రజనీకి తేనీటి విందు ఇవ్వనున్న చంద్రబాబు
Balakrishna welcomes Rajinikanth

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. 2004లో కృష్ణానది పుష్కరాల సందర్భంగా రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. 


ఈ సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ జరగనుంది. ఈ సభలో చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు.

More Telugu News