Avinash Reddy: వివేకా హత్య కేసు: ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్

  • వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ
  • ఇప్పటికే అవినాశ్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ
  • ఈసారి విచారణలో అరెస్ట్ చేయొచ్చంటూ ప్రచారం
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్
Avinash Reddy fles petition seeking advance bail

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

త్వరలోనే అవినాశ్ ను సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సీబీఐ గత విచారణ సమయంలోనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలపై చర్చ జరిగింది. ఆ సమయంలో అవినాశ్ రెడ్డి కోర్టుకు వెళ్లగా, అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలివ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

More Telugu News