ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ నేడే.. కీలక ప్లేయర్ దూరం
- దాయాది దేశాల మహిళల జట్ల మధ్య అమీతుమీ
- సాయంత్రం గం. 6.30 నుంచి మ్యాచ్
- స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం
బలమైన జట్టుగా దిగుతున్న భారతే ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కనిపిస్తున్నది. అయితే భుజం గాయంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, చేతి వేలి గాయంతో స్మృతి మంధాన ఇబ్బందిపడుతున్నారు. ఈ మ్యాచ్ కు మంధాన అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. కొన్ని రోజుల కిందట ఇదే దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్19 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యులు షెఫాలీ, రిచా ఘోష్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ చానెల్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.