Chiranjeevi: తక్కువ గ్యాప్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్!

  • వరుస సినిమాలతో దూసుకుపోతున్న మైత్రీ 
  • జనవరి 12న విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • ఆ మరుసటి రోజునే వచ్చిన 'వాల్తేరు వీరయ్య'
  • రెండూ భారీ వసూళ్లను సాధించినవే
  • నిన్న విడుదలైన 'అమిగోస్'తో లభించిన మరో హిట్

Mytri Movie Makers got hatrick hit

ఇప్పుడు ఎక్కడ చూసినా మైత్రీ మూవీ మేకర్స్ పేరే వినిపిస్తోంది. ఈ నిర్మాణ సంస్థను ఆరంభించిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సాధారణంగా ఏ నిర్మాణ సంస్థ అయినా ఒక ప్రాజెక్టు తరువాత మరో ప్రాజెక్టును సెట్ చేసుకుంటూ వెళుతుంటుంది. కానీ మైత్రీ మాత్రం ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తూ వెళుతోంది.ఈ బ్యానర్లో నిర్మితమైన 'వీరసింహారెడ్డి' జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి రోజునే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఆ మరుసటి రోజునే 'వాల్తేరు వీరయ్య' థియేటర్స్ లో దిగిపోయాడు. ఈ రెండు సినిమాలు కూడా చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. సంక్రాంతి బరిలో ఒకే బ్యానర్ కి చెందిన రెండు పెద్ద సినిమాలు పోటీకి దిగడం మైత్రీ బ్యానర్ విషయంలోనే జరిగింది. ఇక ఇదే బ్యానర్ నుంచి నిన్న 'అమిగోస్' సినిమా వచ్చింది. కొత్త దర్శకుడిని నమ్మి .. కొత్త పాయింటును నమ్మి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కథాకథనాల పరంగానే కాదు .. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి. నిన్న సాయంత్రానికే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా చాలా తక్కువ గ్యాప్ లో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకోవడం కూడా మైత్రీకి దక్కిన అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి .. ఒప్పుకోవాలి.

More Telugu News