టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్ గొంగడి త్రిషకు ఘన స్వాగతం
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అధికారులు, క్రీడాభిమానులు
- ఇంగ్లండ్ తో ఫైనల్లో టాప్ స్కోరర్ గా నిలిచిన త్రిష
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించింది. క్రికెటర్లు, వారి తల్లిదండ్రులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. త్రిషకు స్వాగతం పలికేందుకు అధికారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.