Cricket: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఐసీసీ.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపీ

  • అమెరికా నుంచి గతేడాది మోసం
  • అధికారికంగా స్పందించని ఐసీసీ
  • అంతర్గత విచారణ జరుపుతున్న వైనం
ICC loses around Rs 20 crore in phishing scam

సైబర్ నేరగాళ్లు అమాయకులకే కాదు ప్రముఖ సంస్థలకు కూడా కుచ్చుటోపి పెడుతున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ)ని మోసం చేశారు. ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు. అమెరికా నుంచి గతేడాది ఈ స్కామ్ జరిగినట్టు సమాచారం. దీనిపై ఐసీసీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. అంతర్గత విచారణ చేపట్టింది. బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) అనే పద్ధతి ద్వారా ఈ మోసం జరిగింది. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్‌ అంటూ ఈ సంస్థ నుంచి సొమ్మును కాజేసినట్లు సమాచారం. 

కొన్ని కొనుగోళ్ల విషయమై అమెరికాకు చెందిన ఓ సంస్థకు ఐసీసీ చెల్లింపులు చేసింది. కానీ, అది తప్పుడు సంస్థ అని తెలిసి షాక్ కు గురైంది. ఐసీసీ కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఓ ఐడీతో మోసగాళ్లు ఈ తతంగం నడిపించారు. దాంతో, ఐసీసీ గుడ్డిగా నమ్మి చెల్లింపులు జరిపింది. ఏకంగా మూడుసార్లు చెల్లింపులు జరిపి 2.5 మిలియన్ డాలర్లు మోసపోయింది. విదేశాల్లో బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) మోసాలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. కానీ, ఆర్థికంగా ఎంతో బలమైన, పటిష్ఠ వ్యవస్థ కలిగిన ఐసీసీ మోసపోవడం చర్చనీయాంశమైంది.

More Telugu News