ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిపై.. కాసేపట్లో అమిత్ షాతో భేటీ

Telangana Governor Tamilisai reached Delhi
  • ప్రొటోకాల్ ఉల్లంఘనలు, తన వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి చర్చించే అవకాశం
  • పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న గవర్నర్
  • తాజా రాజకీయ పరిణామాలతో తమిళిసై పర్యటనపై ఆసక్తి
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను ఆమె కలవనున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో తమిళిసై చర్చించే అవకాశం ఉంది. తన పర్యటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తన వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
Go Back to Shorts
Amit Shah
BJP
Tamilisai Soundararajan
Delhi

More Telugu News