Kanti Velugu: తెలంగాణలో మళ్లీ 'కంటి వెలుగు'

  • రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం
  • కంటి వెలుగు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం
  • 2018 ఆగస్ట్ లో తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
Kanti Velugu programme from tomorrow

తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమం అమలు కాబోతోంది. జనవరి 18 నుంచి రెండో విడత అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం తొలి విడతకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. 2018 ఆగస్ట్ 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం అప్పట్లో ప్రభుత్వం రూ. 106 కోట్లను ఖర్చు చేసింది. కళ్లద్దాలతో పాటు మందులను కూడా పంపిణీ చేసింది. 

ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం అమలుపై ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యశాఖ మంత్రితో పాటు కొందరు ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.

More Telugu News