టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయి: రమణ దీక్షితులు
- తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడుగా కొనసాగుతున్న రమణ దీక్షితులు
- సీఎం జగన్ తిరుమల పర్యటన నిరాశపరచిందని వ్యాఖ్య
- వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్
తిరుమల పర్యటనలో భాగంగా వంశపారంపర్య అర్చక వ్యవస్థపై నియమించిన ఏకసభ్య కమిటీ సమర్పించిన నివేదికపై జగన్ స్పందిస్తారని తామంతా ఆశించామని రమణ దీక్షితులు అన్నారు. అయితే ఆ దిశగా సీఎం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తమను నిరాశకు గురి చేసిందని అయన అన్నారు. ఈ సందర్భంగా టీటీడీపై విమర్శలు గుప్పించిన దీక్షితులు.. అర్చక వ్యవస్థను టీటీడీ నాశనం చేసేలోగానే జగన్ స్పందించాలని కోరారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.