ఈ నెల 25 నుంచి శ్రీశైలంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం జగన్కు ఆహ్వానం
- తాడేపల్లిలో జగన్ను కలిసిన శిల్పా చక్రపాణి రెడ్డి
- శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వచ్చిన వైనం
- జగన్కు తీర్థ ప్రసాదాలు అందించిన వైసీపీ ఎమ్మెల్యే
శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి... శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారిలతో కలిసి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించిన చక్రపాణి రెడ్డి... స్వామివారి ప్రసాదాన్ని జగన్కు అందజేశారు.