Mallikarjun Kharge: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మరోసారి కరోనా

  • ఈ ఏడాది జనవరిలో ఖర్గేకు తొలిసారి కరోనా
  • హోం ఐసోలేషన్ లో ఉండి కోలుకున్న నేత
  • తాజాగా రెండోసారి పాజిటివ్
  • నిన్న రాజ్యసభలోనూ ప్రసంగించిన ఖర్గే
  • తనను కలిసిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
Congress leader Mallikarjun Kharge tested corona positive for the second time

రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయన ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కరోనాకు గురయ్యారు. అప్పట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి కోలుకున్నారు. కొన్నినెలల వ్యవధిలోనే ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన నిన్న రాజ్యసభలో వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా, తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More Telugu News