'బింబిసార', 'సీతారామం' గురించి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది.. ఇది కదా కావాల్సింది: అడివి శేష్

Adivi Sesh responce on Bimbisara movie
  • ఈరోజు థియేటర్లలో విడుదలైన 'బింబిసార', 'సీతారామం'
  • ఈ చిత్రాలు హిట్ కావడంపై సంతోషం వ్యక్తం చేసిన అడివి శేష్
  • కరోనా వల్ల తాను ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
ఈ రోజు 'బింబిసార', 'సీతారామం' చిత్రాలు విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాలు హిట్ కావడంపై హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', తన స్కేహితులు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్ నటించిన 'సీతారామం' బాగున్నాయంటూ బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోందని అన్నారు. ఇండస్ట్రీకి ఇది కదా కావాల్సింది అని చెప్పారు. 

ఈ చిత్రాలు హిట్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా వచ్చి ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నానని... అందుకే తాను థియేటర్లకు వచ్చి సినిమాలు చూడలేకపోతున్నానని... తన కోసం మార్నింగ్ షోలో ఒక సినిమా, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి అంటూ అభిమానులకు సూచించారు. మరోవైపు, అడివి శేష్ కు కరోనా అని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Go Back to Shorts
Adivi Sesh
Bimbisara Movie
Sita Ramam
Tollywood

More Telugu News