మణిపూర్​లో స్వల్ప భూకంపం

Earthquake hits Manipur
  • శనివారం రాత్రి  11:42 గంటలకు కంపించిన భూమి
  • రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత నమోదు
  • ఈనెల 5న అస్సాంలోనూ భూకంపం
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని మోయిరాంగ్‌కు తూర్పు-ఆగ్నేయంలో శనివారం రాత్రి 11:42 గంటలకు భూమి కంపించడంతో ప్రజలకు అందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం లోతు 94 కి.మీ.గా ఉందని చెప్పింది. 
 
అంతకుముందు ఈ నెల 5న అస్సాంలో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 11:03 గంటలకు సంభవించిన భూకంపం యొక్క లోతు 35 కి.మీ. గా ఎన్సీఎస్ గుర్తించింది. దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎన్సీఎస్ భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది.
Go Back to Shorts
manipur
earthquake
richter scale

More Telugu News