Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు: నాగబాబు

  • భీమవరంలో ఘనంగా జరిగిన అల్లూరి జయంతి ఉత్సవాలు
  • హాజరైన మోదీ, జగన్, రోజా, చిరంజీవి 
  • మహా నటులందరికీ అభినందనలు అన్న నాగబాబు
Except Chiranjeevi all are acted good in Bhimavaram sabha says Nagababu

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, రాష్ట్ర మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 

అయితే ఈ సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో తన అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారని అన్నారు. ఆ మహా నటులందరికీ తన అభినందనలు అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకాని సంగతి తెలిసిందే.

More Telugu News