వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక
- వైసీపీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య. బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి నామినేషన్లు
- శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
- 4 స్థానాలకు నలుగురే బరిలో ఉన్నట్లు ఈసీ నిర్ధారణ
- ఆ నలుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటన
- డిక్లరేషన్లు అందుకున్న వైసీపీ అభ్యర్థులు
వాస్తవానికి రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసేసరికి ఎంతమంది బరిలో ఉంటారన్న దానిపై ఈసీ ఓ ప్రకటన చేస్తుంది.
ఆ దిశగానే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఏపీ కోటాలోని 4 స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే బరిలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆ నలుగురు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాల ఆధారంగా నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయి. దీంతో వైసీపీ మినహా ఏ ఒక్క పార్టీ కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపలేదు.