Nizamabad District: దంప‌తుల మ‌ధ్య రాజీ య‌త్నంలో ఘ‌ర్ష‌ణ‌... భ‌ర్త త‌ర‌ఫు బంధువును చంపేసిన భార్య బంధువర్గం

  • నిజామాబాద్ జిల్లా ధ‌ర్మారంలో ఘ‌ట‌న‌
  • రాజ‌య్య క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి మూకుమ్మ‌డి దాడి
  • తీవ్ర గాయాల‌తో ఘ‌ట‌నా స్థ‌లిలోనే మృతి చెందిన రాజ‌య్య‌
  • ఘ‌ర్ష‌ణ‌లో మ‌రో 9 మందికి గాయాలు

తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లా ధ‌ర్మారంలో దారుణం చోటుచేసుకుంది. దంప‌తుల మ‌ధ్య రాజీ కుదిర్చే య‌త్నంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భ‌ర్త త‌ర‌ఫు బంధువు రాజ‌య్య‌... భార్య త‌ర‌ఫు బంధువుల చేతిలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. రాజ‌య్య క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి మ‌రీ భార్య త‌ర‌ఫు బంధువులు రాళ్లు, ఇటుక‌ల‌తో ఆయ‌న‌పై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రాజ‌య్య అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో మ‌రో 9 మందికి గాయాల‌య్యాయి.

దంపతుల మ‌ధ్య నెల‌కొన్న విభేదాల‌ను ప‌రిష్క‌రించే నిమిత్తం చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆ దంప‌తుల త‌ర‌ఫు బంధువులు పూనుకున్నారు. ఈ క్ర‌మంలో ధర్మారంలో గురువారం సాయంత్రం చ‌ర్చ‌లు మొద‌లు కాగా... స్వ‌ల్ప స్థాయిలో పెరిగిన మాట‌ల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ వాగ్వాదం నేప‌థ్యంలో భ‌ర్త‌, భార్య త‌ర‌ఫు బంధువులు ఇరు వ‌ర్గాలుగా విడిపోయి ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. 

ఈ క్ర‌మంలో రాళ్లు, ఇటుక‌ల‌తో ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నాయి. భర్త త‌ర‌ఫున చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన ఆయ‌న బంధువు రాజ‌య్య‌పై భార్య త‌ర‌ఫు బంధువులు మూకుమ్మ‌డి దాడికి దిగారు. రాజయ్య క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లిన భార్య త‌ర‌ఫు బంధువులు ఆయ‌న‌ను చిత‌క‌బాదారు. ఈ దాడిలో తీవ్ర గాయాల‌పాలైన రాజయ్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో మ‌రో 9 మందికి గాయాలయ్యాయి.

More Telugu News