కొత్త ఇంట్లోకి మారుతున్న రష్మిక మందన్న
- 2021 ఫిబ్రవరిలో ముంబైలో ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక
- బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న కన్నడ బ్యూటీ
- సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యే పనిలో ఉన్న రష్మిక
వాస్తవానికి 2021 ఫిబ్రవరిలోనే ముంబైలో రష్మిక ఒక ఇంటిని కొనుగోలు చేసింది. బాలీవుడ్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లలో బస చేయకుండా... సొంత ఇంటికి మారే ప్రయత్నంలో రష్మిక ఉంది. ఇక తెలుగు విషయానికి వస్తే... 'పుష్ప.. ది రూల్' సినిమా షూటింగ్ కు ఆమె సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది డెసెంబర్ లో థియేటర్లలోకి రానుంది.