20 ఏళ్ల యువతిపై అత్యాచారం.. మెడలో చెప్పుల దండేసి వీధుల్లో ఊరేగింపు.. రిపబ్లిక్ డే నాడే దారుణం.. ఇదిగో వీడియో

Woman Gang Raped And Paraded After Head Tonsured
  • ఢిల్లీలోని కస్తూర్బా నగర్ లో దారుణ ఘటన
  • అక్రమ మద్యం అమ్మకందారుల వికృత చర్య
  • ఆపాల్సిన మహిళలే దగ్గరుండి ప్రోత్సహించిన వైనం
  • సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్
  • ఢిల్లీ పోలీసులకు నోటీసులు.. చర్యలు తీసుకోవాలని ఆదేశం
ఓ మహిళను ఇంటి నుంచి బయటకు లాగి సామూహిక అత్యాచారం చేశారు కొందరు దుండగులు. శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండేసి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ కస్తూర్బా నగర్ లో గణతంత్ర దినోత్సవం రోజునే జరిగింది. బాధితురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఆమె చేసిన నేరం ఏమీ లేదు. భర్త చనిపోవడంతో.. ఉన్న ఒక్కగానొక్క కూతురితో కలిసి  బతుకుతోంది. ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. కానీ, అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ యువకుడు గత ఏడాది నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అక్కడే ఉన్న మహిళలంతా ఆపాల్సిందిపోయి ఆ మగవారిని ప్రోత్సహించారు. సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

20 ఏళ్ల అమ్మాయిపై అక్రమ మద్యం అమ్మకందారులు దారుణానికి తెగబడ్డారని, దీనిపై ఢిల్లీ పోలీసులు 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు, వారికి సహకరించిన మహిళలపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు నిందితులపై అక్రమ మద్యం అమ్మకాలు, డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులనూ తిరగదోడాలని సూచించారు.
Go Back to Shorts
Republic Day
New Delhi
Rape
Crime News

More Telugu News