Ramcharan: చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని!

  • 'ఇండియన్ 2' పైకి వెళ్లిన శంకర్
  • ఆరు నెలల తరువాతే తిరిగి రాక  
  • గౌతమ్ తిన్ననూరితో చరణ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి
Disha  Pathani in Charan Movie

చరణ్ 15వ సినిమాగా శంకర్ మూవీ రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఇంతవరకూ రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ నెల జూన్ కి షూటింగును పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అనుకున్నారు. కానీ అనుకోకుండా 'ఇండియన్ 2' సినిమాకి లైన్ క్లియర్ కావడంతో అటువైపు వెళ్లిపోయాడు.

ఒక ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగు వాయిదా పడినట్టేనని అంటున్నారు. ఈ లోగా ఎవరికి వారు ఆ తరువాత చేయవలసిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. చరణ్ తన తదుపరి సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను ముందుకు జరుపుతున్నట్టుగా సమాచారం.

సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి, శంకర్ వచ్చే లోగా పూర్తిచేయాలని గౌతమ్ తో చరణ్ చెప్పాడట. దాంతో ఆ దిశగా సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. కథానాయికగా దిశా పటాని పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఆమె పేరే ఖరారు కావొచ్చని అంటున్నారు. 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇదేకావడం విశేషం.

More Telugu News