Saitej: జీ 5 ఓటీటీ వేదికపై 'రిపబ్లిక్' చిత్రాన్ని వీక్షించిన సాయితేజ్

  • దేవ కట్టా నుంచి వచ్చిన 'రిపబ్లిక్'
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • థియేటర్ల నుంచి పెద్దగా రాని రెస్పాన్స్
  • జీ 5 ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ ప్రారంభం
Republic movie releases on ZEE5 as Saitej watched the movie along with unit members

సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోను .. సినిమా విడుదల సమయంలోను హాస్పిటల్లోనే ఉన్నాడు.

అహంభావంతో కూడిన ఒక రాజకీయ నాయకురాలికీ, ఆత్మాభిమానం .. ఆశయం .. ఆవేశం ఉన్న ఒక అధికారికి మధ్య జరిగే పోరాటం ఇది. జగపతిబాబు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ కాలేకపోయింది. అందువలన ఈ సినిమాను జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా జనంలోకి తీసుకువెళ్లారు.

థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన సాయితేజ్, జీ 5 ఓటీటీ వేదిక ద్వారా చూశాడు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు దేవ కట్టా .. స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ .. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీశ్ బీకేఆర్ .. జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సంతోషాన్ని పంచుకున్నాడు. ఇక ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.

More Telugu News