సమీర్ వాంఖడే స్థానంలో సంజయ్ కుమార్ సింగ్.. ఆర్యన్ ఖాన్ కేసులో ఇక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా?
- సమర్థుడైన అధికారిగా గుర్తింపు
- 1996 బ్యాచ్ ఒడిశా కేడర్ అధికారి
- ఒడిశాలో డ్రగ్ ముఠాల ఆట కట్టించిన సంజయ్
- జనవరిలో ఎన్సీబీలో చేరిక
సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్కు చెందిన ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి. ఒడిశా పోలీస్, సీబీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎన్సీబీలో చేరడానికి ముందు కుమార్ సింగ్ ఒడిశా డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)లో అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా పనిచేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో వరుస యాంటీ డ్రగ్ డ్రైవ్లు జరిగాయి. భువనేశ్వర్లో పలు డ్రగ్ రాకెట్ల ఆట కట్టించారు. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో డీఐజీగా పనిచేశారు. ఆ సమయంలో పలు హై ప్రొఫైల్ కేసులను పర్యవేక్షించారు.
సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీస్ ఐజీపీగా, జంట నగరాల అదనపు కమిషనర్గా పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర దర్యాప్తు సంస్థకు డిప్యూటేషన్పై వెళ్లిన సంజయ్ .. ఎన్సీబీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా చేరారు. ఆయనపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కానీ, క్రిమినల్ కేసులు కానీ పెండింగులో లేవని అలాగే, అవినీతి కేసులు కూడా లేవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.