Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 111 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 29 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,937 మందికి చికిత్స
Telangana covid daily media report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వనపర్తి, వికారాబాద్, సూర్యాపేట, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూలు, ములుగు, మహబూబాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 187 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,68,833 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,917 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,979 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,937కి పెరిగింది.

More Telugu News