COVID19: తెలంగాణలో గత 24 గంటల్లో 196 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 44,310 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 59 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,190 మందికి చికిత్స
Telangana covid media report

తెలంగాణలో గడచిన 24 గంటలలో 44,310 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,266 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,190 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,933కి పెరిగింది.

More Telugu News