siddarth: సమంత, నాగచైతన్య విడిపోయిన వేళ హీరో సిద్ధార్థ్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు వైర‌ల్!

  • పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది
  • మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు..
  • ట్వీట్ చేసిన సిద్ధార్థ్‌
  • స‌మంత గురించే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు
Siddharth Tweets ablu sam

టాలీవుడ్ జంట‌ సమంత, నాగచైతన్య  విడిపోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. స‌మంత పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న ఈ ట్వీట్ చేశాడు. 'పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది.. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు' అని సిద్థార్థ్ అన్నాడు.

నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకోక‌ముందు రోజుల‌ను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ ఇలాంటి వ్యాఖ్య చేశార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌ళ్లీ స‌మంత‌, సిద్ధార్థ్ క‌ల‌వాలంటూ ఒక‌రు కామెంట్ చేశారు. నాగ‌చైత‌న్య, సమంత విడిపోతే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తావా? అంటూ మ‌రికొంద‌రు చివాట్లు పెడుతున్నారు.

అప్ప‌ట్లో సిద్ధార్థ్‌, స‌మంత క‌లిసి తిరిగిన రోజుల‌ను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. కాగా, స‌మంత కూడా నిన్న 'కొన్నిసార్లు వాళ్లే గెలవొచ్చు... కానీ చివరికి వాళ్లే పతనమవుతారు. దీన్ని నేనెప్పుడూ నమ్ముతుంటాను' అంటూ ఓ పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆమె ఎవ‌రిని ఉద్దేశించి పోస్ట్ చేసిందో కూడా తెలియ‌క నెటిజ‌న్లు తిక‌మ‌కప‌డుతున్నారు.  

More Telugu News