Telangana: తెలంగాణలో 200కి దిగువన రోజువారీ కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు
  • 170 పాజిటివ్ కేసులు నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
  • ఇంకా 4,612 మందికి చికిత్స
Telangana Covid Media Bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 11, నల్గొండ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,65,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,56,544 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,612 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News