తెలంగాణలో మరో 259 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 58,261 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,282 మందికి చికిత్స
అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,62,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,53,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,282 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,900కి పెరిగింది.
