Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన కొత్త క‌రోనా కేసులు

  • దేశంలో నిన్న కొత్తగా 25,404 కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,32,89,579
  • మ‌రో 339 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,43,213
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 25,404 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,32,89,579కి చేరింది. అలాగే, నిన్న 37,127 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 339 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,213కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,24,84,159 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,62,207 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 78,66,950 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,22,38,324 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో దేశంలోనే అత్య‌ధికంగా 15,058 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 99 మంది మృతి చెందారు.

More Telugu News