Team India: పంత్, శార్దూల్ పోరాటం... మ్యాచ్ ను శాసించే స్థితిలో భారత్

  • లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • రెండో ఇన్నింగ్స్ లో భారీస్కోరు దిశగా భారత్
  • 130 ఓవర్లలో 6 వికెట్లకు 375 రన్స్
  • ప్రస్తుతం భారత్ ఆధిక్యం 276 పరుగులు
Team India in strong position in fourth test

నాలుగో టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 6 వికెట్లకు 375 పరుగులు చేసింది. దాంతో భారత్ ఆధిక్యం 276 పరుగులకు చేరింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (37 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్ (36 బ్యాటింగ్) ఉన్నారు. ఓ దశలో భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (17), రహానే (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44) వెనుదిరిగారు. ఈ దశలో మరికొన్ని వికెట్లు పడితే భారత్ కష్టాల్లో పడేది. అయితే, పంత్, శార్దూల్ జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడడమే కాకుండా, స్కోరుబోర్డును ముందుకు ఉరికించారు.

More Telugu News