Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన కొత్త‌ క‌రోనా కేసులు

  • దేశంలో నిన్న 25,072 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306
  • నిన్న 389 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,34,756  
corona bulletin in inida

దేశంలో నిన్న 25,072 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 44,157 మంది కోలుకున్నారు. నిన్న 389 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,756కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,80,626 మంది కోలుకున్నారు.    

3,33,924 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 7,95,543 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,25,49,595 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.            
నిన్న దేశంలో 12,95,160 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) తెలిపింది. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,75,51,399 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వివ‌రించింది.

More Telugu News