Rajasthan: సెప్టెంబరు 13న చంపేస్తున్నాం.. చేతనైతే రక్షించుకోండి: రాజస్థాన్ జడ్జికి బెదిరింపు లేఖ

  • మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు
  • తుపాకితో కాల్చి గానీ, విషమిచ్చి గానీ, వాహనంతో ఢీకొట్టి కానీ చంపేస్తాం
  • పోలీసులకు కూడా ఈ విషయాన్ని చేరవేశాం
  • లేఖలో పేర్కొన్న అజ్ఞాత వ్యక్తి
Will commit murder on September 13 district judge in Rajasthan received a threatening letter

‘‘మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబరు 13న హత్య చేస్తున్నాం. మీ ఇంటిని బాంబులతో పేల్చేద్దామనుకున్నాను కానీ, మీ కుటుంబ సభ్యుల వల్ల నాకు హాని లేదు కాబట్టి ఆ ఆలోచన విరమించుకున్నా. తుపాకితో కాల్చిగాని, విషమిచ్చి కానీ, వాహనంతో ఢీకొట్టి కానీ.. ఏదో రకంగా మిమ్మల్ని చంపేస్తా. కోర్టులో నిందితుడికి మీరు ఎలా అయితే అవకాశం ఇస్తారో, మేం కూడా రక్షించుకునేందుకు మీకు అవకాశం ఇస్తున్నాం. ఈ విషయమై పోలీసులకూ సమాచారం ఇచ్చాం. చేతనైతే రక్షించుకోండి’’ అంటూ రాజస్థాన్‌లోని బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారికర్‌కు అజ్ఞాత వ్యక్తి ఒకరు లేఖ రాశాడు.

హిందీలో రాసిన ఈ లేఖలో జడ్జికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.

More Telugu News