Corona Virus: దేశంలో 149 రోజుల క‌నిష్ఠ‌ స్థాయికి యాక్టివ్ కేసుల సంఖ్య

  • 3,64,129 మందికి ప్రస్తుతం చికిత్స 
  • దేశంలో నిన్న 36,401 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,22,258
  • నిన్న 530 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,33,049
corona bulletin in inida

దేశంలో నిన్న 36,401 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,22,258కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,157 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 530 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,33,049కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,25,080 మంది కోలుకున్నారు.  

యాక్టివ్ కేసుల సంఖ్య 149 రోజుల క‌నిష్ఠ‌ స్థాయికి చేరుకుంది. 3,64,129 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 56,36,336 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56,64,88,433 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

More Telugu News