Telangana: తెలంగాణలో కొత్తగా 569 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 1,05,201 కరోనా టెస్టులు
  • గ్రేటర్ హైదరాబాదులో 82 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 8,582 మందికి చికిత్స
Telangana covid media report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,05,201 కరోనా పరీక్షలు నిర్వహించగా, 569 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 64, వరంగల్ అర్బన్ జిల్లాలో 51, ఖమ్మం జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,48,957 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,36,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,582 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,823కి చేరింది.

More Telugu News