Varudu Kavalenu: గుమ్మడికాయ కొట్టేసిన 'వరుడు కావలెను'

  • 'వరుడు కావలెను' చిత్రం షూటింగ్ పూర్తి
  • నాగశౌర్య, రీతూవర్మ జంటగా చిత్రం
  • లక్ష్మీసౌజన్య దర్శకత్వం
  • త్వరలో థియేటర్లలో రిలీజ్
Varudu Kavalenu shooting completed

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు లక్ష్మీసౌజన్య దర్శకురాలు. ఆమె దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. యూత్ ఫుల్ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న 'వరుడు కావలెను' చిత్రం షూటింగ్ పూర్తయిందని దర్శకురాలు వెల్లడించారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమ, భావోద్వేగాలను పండిస్తామని ఆమె తెలిపారు. త్వరలోనే 'వరుడు కావలెను' చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతుందని లక్ష్మీసౌజన్య వెల్లడించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టయిన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

More Telugu News