AAP: గ‌తుకులమ‌య‌మైన‌ రోడ్డు.. సంగీత క‌చేరితో నిర‌స‌న‌ వ్యక్తం.. వీడియో ఇదిగో!

  • ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కోర్బాలో ఘ‌ట‌న‌
  • ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేత‌ల ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌
  • ప్ర‌జ‌లు ఓట్లు వేసి ఎటువంటి నాయ‌కుల‌ను ఎన్నుకుంటున్నార‌ని ప్ర‌శ్న
  • ఓట్లు అమ్ముకుంటే ఇలాంటి ప‌రిస్థితులే వ‌స్తాయ‌ని వ్యాఖ్య
app video goes viral

రోడ్డంతా గ‌తుకులమ‌య‌మైంది.. అధికారులు ప‌ట్టించుకోవ‌ట్లేదు. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వ‌ర్షం కురిస్తే న‌ర‌కం క‌న‌ప‌డుతోంది. దీంతో త‌మ క‌ష్టాలు ప‌ట్టించుకోని ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కోర్బాలో సంగీత క‌చేరి ప్ర‌ద‌ర్శ‌న‌ నిర్వ‌హించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేత‌లు నిర్వ‌హించిన ఈ క‌చేరిలో పాట‌లు పాడుతూ ప్ర‌భుత్వాన్ని కాకుండా ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌లు ఓట్లు వేసి ఎటువంటి నాయ‌కుల‌ను ఎన్నుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. క‌నీసం గ‌తుకుల రోడ్లను కూడా బాగు చేయించని వారిని ఎన్నుకుంటే ప్రయోజనం ఏంట‌ని నిల‌దీశారు.

ఈ సంద‌ర్భంగా ఆప్ నాయ‌కుడు విశాల్ కేల్కార్ మాట్లాడుతూ... కోర్బా జిల్లా వ్యాప్తంగా రోడ్లు ఇలాగే ఉన్నాయ‌ని చెప్పారు. ఇందుకు కార‌ణం ప్ర‌జ‌లేన‌ని అన్నారు. ఇక‌నైనా త‌మ ఓట్ల‌ను అమ్ముకోకుండా అభివృద్ధి చేసే వారికే ఓట్లు వేయాల‌ని చెప్పామ‌ని అన్నారు. సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌తో తాము ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

More Telugu News