Madhya Pradesh: కూలిన జైలు గోడ.. 22 మంది ఖైదీలకు తీవ్ర గాయాలు

  • మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా జైల్లో ఘటన
  • తెల్లవారుజామున కూలిన బ్యారక్ గోడ
  • తీవ్రంగా గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స
22 prisoners wounded as jail wall collapses

జైలు బ్యారక్ గోడ కూలిన ఘటనలో 22 మంది ఖైదీలు గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా జైల్లో జరిగింది. గాయపడిన ఖైదీల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై భిండ్ జిల్లా పోలీసు అధికారి మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ తెల్లవారుజామున ఆరవ నంబర్ బ్యారక్ లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.

తీవ్రంగా గాయపడిన ఖైదీలు గ్వాలియర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. స్వల్పంగా గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ జైలు భవనం పురాతనమైనది. దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో గోడ బాగా నానిపోయి కూలిపోయింది. ఈ జైల్లో ప్రస్తుతం 255 మంది ఖైదీలు ఉన్నారు.

More Telugu News