Corona Virus: దేశంలో నిన్న 38,164 క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229
  • నిన్న‌ 499 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,14,108
  • మొత్తం  44,54,22,256 కరోనా పరీక్షలు
దేశంలో నిన్న 38,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. అలాగే, నిన్న 38,660 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే... నిన్న‌ 499 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,14,108కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,08,456 మంది కోలుకున్నారు. 4,21,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40,64,81,493 వ్యాక్సిన్ డోసులు వేశారు.    
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,54,22,256 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,63,593 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News