Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు!

  • నిన్న 38,079 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908
  • నిన్న‌ 560 మంది క‌రోనాతో మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,13,091
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న 38,079 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది.

మరణాల విషయానికొస్తే... నిన్న‌ 560 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,091కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. 4,24,025 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. రిక‌వ‌రీ రేటు 97.31 శాతంగా ఉంది.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,20,21,954 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,98,715 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News