Corona Virus: దేశంలో నిన్న 38,949 క‌రోనా కేసులు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829
  • నిన్న‌ 542 మంది క‌రోనాతో మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,12,531
  • మొత్తం 39,53,43,767 వ్యాక్సిన్ డోసులు
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న 38,949 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 40,026 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కు చేరింది.

మరణాల విషయానికొస్తే... నిన్న‌ 542 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,12,531కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876  మంది కోలుకున్నారు. 4,30,422 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న ఒక్కరోజు 38,78,078 వ్యాక్సిన్ డోసులు వేయగా.. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 39,53,43,767 వ్యాక్సిన్ డోసులు వేయడం జరిగింది.  
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,00,23,239 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,55,910 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News