Banks: తెలంగాణలో మారిన బ్యాంకుల పనివేళలు

  • ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
  • బ్యాంకర్ల కమిటీ వెల్లడి
  • నిన్న లాక్ డౌన్ పొడిగించిన సర్కారు
  • ప్రజా కార్యకలాపాల సమయం పొడిగింపు
Banks timings changed in Telangana after govt decision

తెలంగాణలో నిన్న లాక్ డౌన్ 10 రోజుల పాటు పొడిగిస్తూ, ప్రజా కార్యకలాపాల సమయం పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రజల కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది. ఇంతకుముందు, లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా... బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి. తాజా సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి.

More Telugu News