కరోనా రోగులపై రెమ్డెసివిర్ ప్రభావం నిల్.. కొవిడ్ చికిత్స నుంచి దూరం కానున్న ఔషధం!
- కరోనా రోగుల అత్యవసర చికిత్సలో రెమ్డెసివిర్ ఉపయోగం
- బ్లాక్ మార్కెట్లో వేలకు అమ్ముడవుతున్న ఇంజక్షన్
- దాని ప్రభావంపై ఆధారాలు లేవన్న డాక్టర్ రాణా
ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా ఈ ఇంజక్షన్ ప్రభావంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఔషధాన్ని కొవిడ్ చికిత్స నుంచి తప్పించాలని యోచిస్తోంది. తాజాగా సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై ఇది ప్రభావం చూపిస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ఇప్పటికే ప్లాస్మా చికిత్సను ప్రొటోకాల్స్ నుంచి తొలగించింది.
కొవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించిన యాంటీబాడీలు కూడా రోగులపై ప్రభావం చూపిస్తాయని తొలుత భావించారు. అయితే, ప్లాస్మా థెరపీ కూడా ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో దానిని తొలగించినట్టు రాణా పేర్కొన్నారు. ఇప్పుడు రెమ్డెసివిర్ ప్రభావానికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, కాబట్టి దీని వాడకాన్ని నిలిపివేయడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.