Dhulipala Narendra Kumar: టీడీపీ నేత ధూళిపాళ్లను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

  • నెగటివ్ రావడంతో జైలుకు తరలించిన అధికారులు
  • తమకు తెలియకుండా ఎలా తరలిస్తారని కోర్టు ఆగ్రహం
  • తిరిగి ఐదు రోజుల ఐసోలేషన్ చికిత్స కోసం డెల్టా ఆసుపత్రికి తరలింపు
jail authorities sends TDP leader Dhulipalla Narendra to Delta Hospital

సంగం డెయిరీలో అక్రమాల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను తిరిగి ఆసుపత్రికి తరలించారు. కరోనా బారినపడిన నరేంద్రకు నెగటివ్ రావడంతో బుధవారం రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే, తమకు తెలియకుండా జైలుకు ఎలా తరలిస్తారని ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుష్ వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఎంచుకున్న ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. దీంతో జైలు అధికారులు నిన్న రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రికి తరలించారు. అక్కడాయన ఐదు రోజులపాటు ఐసోలేషన్ లో చికిత్స తీసుకోనున్నారు.

More Telugu News