Corona Virus: దేశంలో నిన్న క‌రోనాతో 3,754 మంది మృతి

  • నిన్న‌ కొత్త‌గా 3,66,161 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,26,62,575
  •  మొత్తం మృతుల సంఖ్య 2,46,116
  • 17,01,76,603  మందికి వ్యాక్సిన్లు  
India COVID19 case tally crosses 2 crores mark

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 3,66,161 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,53,818 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,26,62,575కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,754 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,46,116కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,71,222 మంది కోలుకున్నారు. 37,45,237 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,01,76,603  మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,37,50,077 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,74,606 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News