Crime News: యూపీలో దారుణం: కోడ‌లు ఉరి వేసుకుంటుంటే.. ఆ దృశ్యాల‌ను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించిన అత్తా‌మామ‌లు!

  • ఉత్తర ప్రదేశ్‌ లోని ముజఫర్ న‌గ‌ర్ లో ఘ‌ట‌న‌
  • అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు
  • భ‌రించ‌లేక కోడ‌లు ఆత్మ‌హ‌త్య‌
woman commits suicide in up laws post it online to claim innocence

కోడ‌లు ఉరి వేసుకుంటుంటే ఆ దృశ్యాల‌ను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు అత్తామామ‌లు. ఉరి వేసుకుంటున్న కోడ‌లిని ఆపాల్సింది పోయి అందుకు సంబంధించిన దృశ్యాల‌ను వీడియో తీసి, ఆమె ఆత్మ‌హ‌త్య ఉదంతంతో త‌మ ప్రమేయం ఏమీ లేద‌ని చెప్పేందుకు ఇలా వీడియో సాక్ష్యాన్ని రూపొందించారు. అనంత‌రం ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు.

క‌ళ్ల ముందే కోడ‌లు చ‌నిపోతున్నా క‌నిక‌రం లేకుండా వారు పాల్ప‌డ్డ చ‌ర్య ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ లోని ముజఫర్‌ డాటియానా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది. ఆ స‌మ‌యంలో కోమల్ తల్లిదండ్రులు క‌ట్నంగా ఐదు లక్షల న‌గ‌దు, ఒక బైక్‌ని ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ ఇంకా క‌ట్నం కావాల‌ని ఆరు నెలలుగా ఆశిష్ త‌ల్లిదండ్రులు కోడ‌లిని వేధిస్తున్నారు. అద‌న‌పు క‌ట్నం తీసుకురాక‌పోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆశిష్‌తో క‌లిసి ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ‌ పెద్దలు ఆమెకు నచ్చజెప్పడంతో తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. ఆమెను అత్తమామలు మళ్లీ  వేధించడంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమెను ఆప‌కుండా, ఆ దృశ్యాల‌ను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్తామామ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News