england: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

  • మ‌హారాష్ట్ర‌లోని పూణె వేదికగా రెండో వ‌న్డే
  • శ్రేయాస్ అయ్య‌ర్ స్థానంలో రిష‌భ్ పంత్‌
  • ఇటీవ‌ల‌ తొలి వ‌న్డేలో గెలిచిన ఇండియా
england wins toss

మ‌హారాష్ట్ర‌లోని పూణె వేదికగా భార‌త్‌తో జ‌రుగుతోన్న రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్య‌ర్ స్థానంలో భార‌త్ రిష‌భ్ పంత్‌కు చోటు క‌ల్పించింది. టీమిండియా తొలి వ‌న్డేలో గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ ను భార‌త్ కైవసం చేసుకోవ‌చ్చు. మరోపక్క రెండో వన్డేలో గెలిచి మ‌ళ్లీ పుంజుకోవాల‌ని ఇంగ్లండ్ భావిస్తోంది.

భారత్ జ‌ట్టులో విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖ‌ర్‌ ధావన్, పంత్‌, కేఎల్‌ రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, చహల్, ప్రసిద్ధ్ ఉన్నారు. ఇంగ్లండ్ జ‌ట్టులో బట్లర్, రాయ్, బెయిర్‌ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, శ్యామ్ కరాన్, టామ్‌ కరన్, రషీద్, టోప్లీ ఉన్నారు.

More Telugu News