petrol: దేశంలో మ‌రి కాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు!

  • పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైస‌ల చొప్పున పెంపు
  • ఢిల్లీలో పెట్రోలు లీట‌రుకు రూ.88.14
  • విజ‌య‌వాడ‌లో లీటరు పెట్రోల్ ధ‌ర రూ.94.25
  • హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.65
Petrol Diesel Price in Hyderabad

దేశంలో వ‌రుస‌గా నాలుగో రోజు కూడా చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైస‌ల చొప్పున పెంచుతున్న‌ట్లు చ‌మురు కంపెనీలు ప్ర‌క‌టించాయి. ఢిల్లీలో పెట్రోలు లీట‌రుకు రూ.88.14, డీజిల్ రూ.78.38కి చేరింది. ముంబైలో లీట‌రు పెట్రోలు ధ‌ర‌ రూ.రూ.94.64, డీజిల్ రూ.85.32 గా ఉంది.

అలాగే,  బెంగళూరులో లీట‌రు పెట్రోలు రూ.91.09, డీజిల్ రూ.83.09, జైపూర్‌లో పెట్రోల్ ధ‌ర‌ రూ.94.81, డీజిల్ ధ‌ర రూ.86.89, పాట్నాలో లీట‌రు పెట్రోలు రూ.90.86, డీజిల్ రూ.83.87 గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటరు పెట్రోల్ ధ‌ర రూ.94.25కి, లీట‌రు డీజిల్ ధ‌ర రూ.87.59కి పెరిగింది. హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.65కి చేరింది. అలాగే, డీజిల్ ధ‌ర లీట‌రుకి రూ.85.50కి పెరిగింది.

More Telugu News