england: వ‌చ్చేనెల 5 నుంచి భారత్‌తో సిరీస్.. ప్రాక్టీసులో పాల్గొన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు

  • భార‌త్ తో  4 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచులు
  • ఇటీవ‌లే ఇండియా చేరుకున్న ఇంగ్లండ్ జ‌ట్టు
  • చెపాక్‌ స్టేడియంలో  ఫస్ట్‌ ట్రైనింగ్‌ సెషన్
  • పాల్గొన్న  బెన్‌స్టోక్స్‌,  జోఫ్రా ఆర్చర్‌,  రోరీ బర్న్స్
England Cricket team begins practice

భార‌త్ తో జ‌ర‌గ‌నున్న 4 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచుల్లో ఆడ‌డానికి ఇటీవ‌లే ఇండియా చేరుకున్న  ఇంగ్లండ్ ప్రాక్టీసు మొద‌లు పెట్టింది. వ‌చ్చేనెల‌ 5 నుంచి చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో ఇరు జ‌ట్ల మధ్య తొలి టెస్టు మ్యాచు జ‌ర‌గ‌నుంది.

ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టు ఆట‌గాళ్లు బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌,  ‌ రోరీ బర్న్స్‌  ప్రాక్టీస్ చేస్తూ క‌న‌ప‌డ్డారు. ఇప్ప‌టికే క్వారంటైన్‌ను  వారు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో మైదానంలో అడుగుపెట్టారు.  చెపాక్‌ స్టేడియంలో  ఫస్ట్‌ ట్రైనింగ్‌ సెషన్‌లో వారు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆస్ట్రేలియా క్రికెట్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

భార‌త్‌లో అడుగుపెట్ట‌క ముందు శ్రీలంకతో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడింది. వాటిల్లో ఈ ముగ్గురు ఆడ‌లేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లు  జట్టులోని ఇత‌ర స‌భ్యుల‌ కన్నా ముందే భారత్‌కు  రావ‌డంతో క్వారంటైన్‌ను వారి క‌న్నా ముందే పూర్తి చేసుకున్నారు. వ‌చ్చేనెల‌  2 నుంచి జ‌ట్టులోని మిగ‌తా సభ్యులు కూడా ప్రాక్టీసులో పాల్గొంటారు.

More Telugu News