Nimmagadda Ramesh Kumar: ఎస్ఈసీ నిమ్మగడ్డకు గవర్నర్ అపాయింట్ మెంట్!

  • ఈ ఉదయం 10 గంటల తరువాత భేటీ
  • ఎన్నికల ఏర్పాట్లపై వివరించనున్న నిమ్మగడ్డ
  • క్రమశిక్షణా చర్యలపైనా వివరణ
Nimmagadda Meeting with Governor Today

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ కానున్నారు. తనకు అపాయింట్ మెంట్ కావాలని నిమ్మగడ్డ సమాచారం పంపగానే, ఈ ఉదయం 10.15 గంటలకు రావాలని గవర్నర్ సూచించారు.

కాగా, ఈ భేటీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఎలక్షన్ కమిషన్ తరఫున తీసుకుంటున్న చర్యలపై ఎస్ఈసీ వివరణ ఇవ్వనున్నారు. ఆపై అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణా చర్యల గురించి కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ వివరిస్తారని తెలుస్తోంది.

More Telugu News