petrol: ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోలు ధ‌ర‌

  • జైపూర్ లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.91.85
  • ముంబైలో పెట్రోల్ ధర లీట‌రుకు రూ.91.07
  • హైదరాబాద్‌లో పెట్రోల్ లీట‌రుకు‌ రూ.87.85
  • డీజిల్‌ రూ.81.45  
hike in petrol price

దేశంలో పెట్రోల్  ధర ఆల్‌టైమ్‌ రికార్డ్ కు చేరుకుంది. ఈ రోజు లీటర్‌ పెట్రోల్ ధర జైపూర్ లో రూ.91.85కి చేరగా, డీజిల్‌ ధర రూ.83.87కి పెరిగింది. అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్య‌ధిక ధ‌ర‌లు అక్క‌డే కొన‌సాగుతున్నాయి. ముంబైలో పెట్రోల్ ధర లీట‌రుకు రూ.91.07కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.34గా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 25 పైసల వరకు పెరగ‌డంతో సామాన్యుడిపై ఈ భారం మ‌రింత పెరిగింది.

న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.45కు, డీజిల్‌ రూ.74.63కు పెరిగింది.  హైదరాబాద్‌లో పెట్రోల్ లీట‌రుకు‌ రూ.87.85, డీజిల్‌ రూ.81.45 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీట‌రుకు రూ.87.18, డీజిల్‌ రూ.79.95, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.85.92, డీజిల్‌ రూ.78.22, బెంగళూరులో పెట్రోల్ ‌రూ.87.30, డీజిల్‌ రూ.79.14 గా ఉంది.  

More Telugu News