మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ.. సింధియా వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు
- కమల్నాథ్ ప్రభుత్వం పడిపోవడంలో సింధియా కీలక పాత్ర
- ఆయన వర్గంలోని 12 మందికి మంత్రి పదవులు
- శివరాజ్ కేబినెట్లో 31కి పెరిగిన మంత్రుల సంఖ్య
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తులసీరాం, గోవింద్లు ఇద్దరూ గతేడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నవంబరులో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ ఘన విజయం సాధించారు. మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ 19 స్థానాల్లో గెలవడంతో ప్రభుత్వం కుప్పకూలిపోకుండా నిలిచింది. కాంగ్రెస్ 9 స్థానాలతో సరిపెట్టుకుంది.